Chandigarh : చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్ మీటింగ్ రసాభాసగా మారింది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కొట్లాడుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల రాజ్యసభలో బీఆర్ ఆంబేద్కర్ను కించపర్చేలా వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్, ఆప్ కౌన్సిలర్లు తప్పుపట్టారు. ఈ మేరకు అమిత్ షాకు వ్యతిరేకంగా కార్పోరేషన్లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి, దానికి ఆమోదముద్ర వేయించుకున్నారు.
అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని కూడా ఆ తీర్మానంలో డిమాండ్ చేశారు. దాంతో ఈ తీర్మానంపై ఓటింగ్కు పోల్ ఆఫీసర్గా వ్యవహరించిన అనిల్ మాషీ కాంగ్రెస్పై విమర్శలు చేశారు. రాహుల్గాంధీపై ఉన్న ఇండియా హెరాల్డ్ కేసును ప్రస్తావించారు. అది కార్పోరేషన్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య గొడవకు దారితీసింది. ఇరు పార్టీల సభ్యులు బాహాబాహీకి దిగారు.
కాంగ్రెస్ హయాంలోనే అంబేద్కర్కు అవమానం జరిగిందని, భారత ప్రధాని నెహ్రూ హయాంలోనే అంబేద్కర్ను అవమానించారని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు. దాంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు బీజేపీపై మండిపడ్డారు. రెండు పార్టీల సభ్యులు ఒకరిపై ఒకరు బాహాబాహీగా దిగడంతో గందరగోళం నెలకొంది. ఈ గందరగోళానికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Scuffle erupted between Congress and BJP councillors over the subject of Dr BR Ambedkar during the general house meeting of Chandigarh Municipal Corporation today
Nominated councillor Anil Masih had targeted Congress and stated that Rahul Gandhi is out on bail, citing… pic.twitter.com/iZmLidgbT0
— ANI (@ANI) December 24, 2024