న్యూఢిల్లీ: బాలరాముడి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ హాజరు కాలేదు. అయోధ్య రామ మందిర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అద్వానీ.. ప్రతిష్ఠాపనకు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. వయోభారం, చలి కారణంగా ప్రారంభోత్సవానికి అద్వానీ వెళ్లలేదని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అద్వానీ 1990లో రథయాత్ర చేపట్టారు. అంతకుముందు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అద్వానీని ఆహ్వానించలేదని వార్తలు రావడంతో.. వీహెచ్పీ నేతలు ఆయన్ను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రం అందజేసిన విషయం తెలిసిందే.