న్యూఢిల్లీ : భారత్ జోడో యాత్రపై బీజేపీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం మండిపడ్డారు. భారత్ జోడో యాత్రతో కాషాయ పార్టీ భయపడుతోందన్నారు. భారత్ జోడో యాత్రను యాత్రను అడ్డుకునేందుకు కొవిడ్ను సాకుగా చూపుతోందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం కొవిడ్ ముప్పు మాట్లాడుతూ.. ఎక్కడా కొవిడ్ లేదని, ఎవరికీ ఏం జరుగదన్నారు. ప్రధానమంత్రి మోదీ మాస్క్ ధరించడం లేదని విమర్శించారు. ప్రజల్లో భయాన్ని సృష్టించడానికి, యాత్రను విచ్ఛిన్నం చేసేందుకు ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.