Naveen Patnaik – Narendra Modi | లోక్సభ ఎన్నికలతోపాటు త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిశాలోని అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీతో జత కట్టేందుకు బీజేపీ ముందుకు రాలేదు. నరేంద్రమోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు ఒడిశాలో సామాన్యుల దరికి చేరలేదని బీజేపీ ఒడిశా శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’లో పోస్ట్ చేశారు. బిజూ పట్నాయక్ సారధ్యంలోని బీజేడీకి వ్యతిరేకంగా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయాన్ని బీజేపీ నాయకుడు అపరాజితా సారంగి ‘ఎక్స్’ వేదికగా స్వాగతించారు. ‘అద్భుతం. కేంద్ర నాయకత్వం నిర్ణయానికి కృతజ్ఞతలు’ అని పోస్ట్ చేశారు.
‘గత పదేండ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి జాతీయ ప్రయోజనాల ద్రుష్టా బిజూ పట్నాయక్ సారధ్యంలోని బీజేడీ మద్దతునిచ్చింది. అందుకు ఆయన (బిజూ పట్నాయక్)కు ధన్యవాదాలు. మోదీ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలు ఒడిశాలోని సామాన్యుల దరి చేరలేదు. ఒడిశా ప్రజల గుర్తింపుపై మేం ఆందోళన చెందుతున్నాం. ఒడిశా ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు పని చేస్తాం’ అని మన్మోహన్ సమాల్ ట్వీట్ చేశారు.