భువనేశ్వర్ : ఒడిశా పూరీలో ముఖ్యమంతి నవీన్ పట్నాయక్ కాన్వాయ్పై కొందరు గుడ్లు విసిరారు. కలహండి టీచర్ కిడ్నాప్, హత్య కేసులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గుడ్లు విసిరినట్లు వెలుగులోకి వచ్చారు. సదరు వ్యక్తులను బీజేపీ కార్యకర్తలుగా గుర్తించినట్లు సమాచారం. పూరీలో రూ.331 కోట్లతో నిర్మించిన హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టును సీఎం నవీన్ పట్నాయక్ ప్రారంభించి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తున్నది.
ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పట్నాయక్ కాన్వాయ్పై నల్లజెండాలు ప్రదర్శించారు. గతంలో పూరీలోని బడా దండాలో సీఎం పట్నాయక్ పర్యటన నేపథ్యంలో నల్లజెండాలు ప్రదర్శించినందుకు బీజేవైఎం, ఎన్ఎస్యూఐకి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కలంకిత మంత్రులపై చర్యలు తీసుకునే వరకు పట్నాయక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతాయని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు పేర్కొన్నారు.