Sambit Patra | బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ట్విట్టర్లో షేర్ చేసిన ఈ ఫొటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నది. ఒడిశాలోని జముగంద్ గ్రామ పర్యటన సందర్భంగా ఆయన ఓ గిరిజన ఇంటిలో భోజనం చేశారు. వృద్ధులు, చిన్న పిల్లలు చూస్తుండగా.. ఆహార పదార్థాలన్నీ తన చుట్టూనే పెట్టుకొని తింటుండటంపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
‘మీ పక్కనున్న పాప కండ్లలోకి చూడండి సంబిత్జీ, మీరు వారి ఆహారాన్ని దొంగిలించి తింటున్నట్టు అనిపిస్తున్నది’, ‘పక్కనున్న వారి ఆకలి మీకు కనిపించడం లేదా?’ ‘ ఈ ఫొటో షోను మీ మోదీజీ నేర్పించారా?’ అని కామెంట్లు చేస్తున్నారు.