న్యూఢిల్లీ, జూలై 5: ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి పూర్తిస్థాయి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇలాంటి చర్యలను ఢిల్లీ ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తారని స్పష్టంచేశారు. వర్షాకాల సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు.
‘కేజ్రీవాల్ను ద్వేషించే క్రమంలో మొత్తం దేశాన్నే మీరు ద్వేషిస్తున్నారు. కేజ్రీవాల్ ముఖ్యం కాదు.. దేశం ముఖ్యం’ అని బీజేపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నారు.