న్యూఢిల్లీ: పంటలపై కనీస మద్దతు ధరకు సంబంధించిన చట్టాన్ని రూపొందించాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. రైతు పంటలకు సంబంధించిన ఇతర అంశాలను కూడా తక్షణమే డిసైడ్ చేయాలని తన లేఖలో కోరారు. రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న మూడు సాగు చట్టాలను ప్రధాని మోదీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆందోళన చేపడుతున్న రైతులంతా తమ ఇండ్లకు వెళ్లాలంటే తక్షణమే ప్రభుత్వం చట్టాన్ని చేయాలని ఎంపీ వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు. రైతు చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఆందోళనలు చేస్తూ సుమారు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబసభ్యులకు నష్టపరిహారంగా కోటి ఇవ్వాలని వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు.
I welcome the announcement of the withdrawal of the 3 #FarmLaws. It is my humble request that the demand for a law on MSP & other issues must also be decided upon immediately, so our farmers can return home after ending their agitation.
— Varun Gandhi (@varungandhi80) November 20, 2021
My letter to the Hon’ble Prime Minister: pic.twitter.com/6eh3C6Kwsz