న్యూఢిల్లీ, మే 21: బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మరోసారి ప్రధాని మోదీపై ఫైర్ అయ్యారు. పాలక బీజేపీ 2024లో ‘ఇండియా షైనింగ్’ తరహా ఉత్పాతాన్ని చూడబోతున్నదని జోస్యంచెప్పారు. వాజపేయి నేతృత్వంలో అప్పటి బీజేపీ ప్రభుత్వం భారత్ వెలిగిపోతున్నదనే అర్థంలో ‘ఇండియా షైనింగ్’ ప్రచారంతో ఎన్నికలకు వెళ్లి కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మోదీ సర్కార్ కూడా అలాగే కుప్పకూలు తుందని ట్వీట్ చేశారు. ఎనిమిదేండ్ల పాలనలో ఆర్థికవృద్ధి సాధించడంలో మోదీ ఘో రంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు.