బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ ఇళ్లపై లేదా, పక్కింటి వారిపై ఏ మూక అయినా దాడులు చేయడానికి వచ్చినప్పుడు చల్లని బాటిల్స్, బాణాలతో సిద్ధంగా ఉండాలంటూ వ్యాఖ్యానించారు. అలాంటి సందర్భాల్లో కాపాడడానికి పోలీసులు కూడా రారని, అందుకే ఎవరికి వారు శీతల పానీయాల బాటిల్స్, బాణాలతో సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
”ఓ గుంపు అనుకోకుండా మీ ఇంటికి కానీ, మీ వీధుల్లోకి గానీ రావొచ్చు. మీ పక్కింట్లోకి కూడా రావొచ్చు. దీనికి ఓ రెమెడీ చెప్తా. అలాంటి అతిథుల కోసం చల్లని బాటిల్స్, కొన్ని బాణాలు సిద్ధం చేసుకొని వుండండి.కాపాడడానికి పోలీసులు కూడా రారు. పైగా తమని తాము రక్షించుకోడానికి దాక్కుంటారు. ఆ మూక జిహాద్ అంటూ స్లోగన్ ఇచ్చి వెళ్లిపోయిన తర్వాత.. పోలీసులు లాఠీలతో వస్తారు. అంతా అయిపోయిన తర్వాత విచారణ అంటూ వస్తారు” అంటూ ఎంపీ సాక్షి మహారాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.