బెంగళూరు: కోట్ల విలువైన చెట్లను అక్రమంగా నరికి అమ్మిన కేసులో కర్ణాటక బీజేపీ ఎంపీ (BJP MP) సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. పార్లమెంటులో అలజడి సృష్టించిన ఇద్దరు వ్యక్తులకు పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా (MP Pratap Simha) సోదరుడు.. విక్రమ్ సింహాపై హసన్ జిల్లాలోని అటవీ శాఖకు చెందిన భూమిలో అనుమతి లేకుండా 126 చెట్లను నరికాడని ఆరోపణలు ఉన్నాయి. కోట్ల విలువైన కలపను అక్రమంగా అమ్మినట్లు విక్రమ్ సింహాపై అధికారులు ఈ నెల 24న కేసు నమోదుచేశారు. తాజాగా అతడిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
15 రోజులకుపైగా సాగిన చెట్ల నరికివేత వ్యవహారంలో విక్రమ్ పాత్రపై తమవద్ద తగిన ఆధారాలు ఉన్నాయని అటవీ అధికారులు స్పష్టం చేశారు. 12 ఎకరాల అటవీ భూమిలో అల్లం పెంచాలని ఆయన ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే దానికి విరుద్ధంగా 126 చెట్లను నరికివేయడాన్ని గుర్తించిన అటవీ అధికారులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.