తిరువనంతపురం, ఏప్రిల్ 14: రైతుల ఆగ్రహానికి తలొగ్గి కేంద్రం గత ఏడాది డిసెంబర్లో రద్దుచేసిన వివాదాస్పద సాగు చట్టాలు మళ్లీ తీసుకొస్తామని బీజేపీ ఎంపీ, ప్రముఖ మలయాళ నటుడు సురేశ్గోపీ తెలిపారు. నిజమైన రైతుల కోసం.. రద్దుచేసిన చట్టాలను కేంద్రం తిరిగి తీసుకొస్తుందని పేర్కొన్నారు. ‘నేను బీజేపీ మనిషిని. సాగు చట్టాలను రద్దుచేయటంపై చాలా కోపంగా ఉన్నాను. మీకు నచ్చినా నచ్చకపోయినా ఆ చట్టాలను మళ్లీ తీసుకొస్తాం. నిజమైన రైతులు ఆ చట్టాలు కావాలని కోరుతారు’ అని పేర్కొన్నారు.