బెంగళూర్ : రోడ్లపై టపాసులు కాల్చవద్దని ప్రజలను కోరుతూ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్తో టైర్ల కంపెనీ సియట్ రూపొందంచిన ప్రకటన పట్ల బీజేపీ ఎంపీ అనంత్కుమార్ హెగ్డే అభ్యంతరం తెలిపారు. సియట్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ అనంత్ వర్ధన్ గోయంకాకు ఈ మేరకు ఎంపీ హెగ్డే లేఖ రాశారు.
నమాజ్ పేరుతో రోడ్లను బ్లాక్ చేయడం, మసీదుల నుంచి వచ్చే భారీ శబ్ధాల వంటి సమస్యల గురించి కూడా కంపెనీ ప్రస్తావించాలని కోరారు. అమీర్ ఖాన్ నటించిన ఈ యాడ్తో హిందువుల్లో అలజడి రేగుతోందని వివరించారు. రాబోయే రోజుల్లో హిందువుల మనోభావాలను కంపెనీ గౌరవిస్తుందని ఆశిస్తున్నామని ఎంపీ పేర్కొన్నారు.