బెంగళూరు : కర్ణాటక సీఎం యెడియూరప్ప ప్రభుత్వ పనితీరుపై నిరసనలు మొదలయ్యాయి. బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ విశ్వనాథ్.. యెడియూరప్ప పరిపాలనను తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ పాలన గాడి తప్పిందన్నారు. ప్రజలందరూ కూడా యోడియూరప్పను వ్యతిరేకిస్తున్నారని, దాన్ని పార్టీ నాయకత్వం గమనించాలన్నారు. యెడియూరప్పకు వయసు పైబడటం, ఆరోగ్యం సహకరించకపోవడం కూడా పాలనకు ఆటంకంగా మారాయన్నారు. ఈ విషయంపై పార్టీ కర్ణాటక ఇంచార్జి అరుణ్ సింగ్తో మాట్లాడానని విశ్వనాథ్ తెలిపారు. యెడియూరప్ప కుమారుడు విజయేంద్ర, అతని స్నేహితులు డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారని ఎమ్మెల్సీ ఆరోపించారు.