పుణె, జనవరి 6: మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే డ్యూటీలో ఉన్న ఓ పోలీస్పై చేయి చేసుకొన్నారు. ఈ ఘటనలో బాధితుడి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్టు పుణె పోలీసులు శనివారం వెల్లడించారు. స్థానిక దవాఖానలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. పుణె కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న సునీల్ కాంబ్లే స్థానిక సస్సూన్ జనరల్ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూ డా ఈ ప్రోగ్రామ్కు హాజరయ్యారు.
కార్యక్రమం పూర్తయిన అనంతరం మెట్లపై నుం చి దిగుతూ వస్తున్న కాంబ్లే.. అక్కడ డ్యూ టీలో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్పై చేయి చేసుకోవడం వీడియోలో కనిపించింది. అయితే పోలీసు అధికారిపై చేయి చేసుకొంటున్నట్టు వస్తున్న ఆరోపణలు ఎమ్మెల్యే కాంబ్లే ఖండించారు. తాను ఎవరిపై దాడి చేయలేదని, మెట్లపై నుంచి దిగుతున్న క్రమంలో అడ్డొచ్చిన వ్యక్తిని తోయడం మాత్రమే జరిగిందని చెప్పుకొచ్చారు.