పనాజీ : గోవాలో కొవిడ్-19 పరిస్థితిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును పాలక పార్టీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బాబుష్ మాన్సరట్ తప్పుపట్టారు. సెకండ్ వేవ్ ముంచుకొస్తుందని ప్రతి ఒక్కరూ ఊహించినా దాన్ని ఎదుర్కొనేందుకు ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆరోపించారు.
రాష్ట్రంలోని అతిపెద్ద కొవిడ్ కేర్ సెంటర్ అయిన గోవా బోధనాసుపత్రి (జీఎంసీహెచ్)ని సహకార సొసైటీగా నడిపిస్తున్నారని, ఇందులో అత్యధిక సిబ్బంది రాణే నియోజకవర్గానికి చెందిన వారేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆక్సిజన్ సరఫరా సహా రవాణా సమస్యలతో గత నాలుగు రోజులుగా జీఎంసీహెచ్ లో 75 మంది కొవిడ్-19 రోగులు మరణించారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.