భోపాల్, ఏప్రిల్ 8: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం నిర్వహించ తలపెట్టిన ఎన్నికల ర్యాలీ సందర్భంగా సభ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన బ్యానర్పై కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి ఫగ్గన్ సింగ్ కులస్థే ఫొటో కనిపించడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మండ్ల లోక్సభ పరిధిలోని ధనోరాలో కాంగ్రెస్ సభ ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా బ్యానర్పై బీజేపీ నేత ఫొటో ఉండటంపై కంగుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు.. ఫగ్గన్ సింగ్ ఫొటోపై వెంటనే కియోలరి కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్వాన్ష్ సింగ్ ఫొటోను అతికించారు. కాగా, దీనిపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ స్పందిస్తూ.. బీజేపీ అభ్యర్థి ఫొటోను తమ బ్యానర్పై పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తమ ఓటమిని అంగీకరించిందని అన్నారు. అయితే మానవ తప్పిదం కారణంగా బ్యానర్లో ఫొటో మారిందని కాంగ్రెస్ నేత కేకే మిశ్రా వివరణ ఇచ్చారు.