న్యూఢిల్లీ : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ఖరారైంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన అనంతరం జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేశామని తెలిపారు. ఎన్డీఏ పక్షాలన్నింటితో చర్చించిన తర్వాతే ముర్ము పేరును ప్రకటించామని స్పష్టం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిపై దాదాపు 20 మంది గురించి ఆలోచించామని చెప్పారు.
రాష్ట్రపతిగా ఎస్టీ మహిళను ఎంపిక చేయాలని నిర్ణయించామని జేపీ నడ్డా పేర్కొన్నారు. ద్రౌపది ముర్ము విశేష ప్రతిభాశాలి అని కొనియాడారు. మంత్రిగా, గవర్నర్గా ద్రౌపది ముర్ము రాణించారని ఆయన తెలిపారు. ఆమె గతంలో జార్ఖండ్ గవర్నర్గా పని చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె టీచర్గా పని చేశారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైడపోసిలో ముర్ము జన్మించారు.
For the first time, preference has been given to a woman tribal candidate. We announce Draupadi Murmu as NDA’s candidate for the upcoming Presidential elections: BJP chief JP Nadda pic.twitter.com/1Hh4Jank5v
— ANI (@ANI) June 21, 2022