(స్పెషల్ టాస్క్ బ్యూరో )
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): తాలుకా స్థాయి నాయకుడి అవినీతిపై సాక్షాత్తు సొంత పార్టీ నేత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి రక్తంతో ఓ లేఖ రాయడం సంచలనం సృష్టించింది. ఇది బీజేపీ నాయకుల అవినీతికి ఇది నిదర్శమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. స్మృతి ఇరానీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథిలో బ్లాక్ అధ్యక్షుడు ఘన్శ్యామ్ చౌరాసియా అవినీతి తారా స్థాయికి చేరిందని శక్తి కేంద్రం కన్వీనర్ భూపేంద్ర మిశ్రా కేంద్ర మంత్రికి రాసిన లేఖలో ఆరోపించారు.
తాము ఇంతకు ముందు కూడా అతని అవినీతిని ఆమె దృష్టికి తీసుకువచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా చౌరాసియా ఒక్క రూపాయి కూడా గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయలేదని ఆరోపించారు. తాను స్మృతి ఇరానీకి ఇల్లు కట్టించి ఇస్తున్నానని, ఎవరూ తననేమీ చేయలేరని బహిరంగంగానే చెబుతున్నాడని తెలిపారు. చౌరాసియా చర్యలను నిరసిస్తూ పంచాయతీ సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.