BJP | బెంగళూరు: కర్ణాటక బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్ ఆ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత లక్ష్మీ హెబ్బల్కర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళల మద్దతు బీజేపీకి పెరుగుతుండటంతో లక్ష్మి హెబ్బల్కర్ ఆందోళనకు గురవుతున్నారని, ఆమెకు నిద్ర పట్టడం లేదని అన్నారు.
రమేశ్ జార్కిహోళి ప్రచారం చేస్తుండటం కూడా ఆమెకు ఇబ్బందికరమేనన్నారు. రాత్రి నిద్ర పట్టాలంటే ఆమె స్లీపింగ్ పిల్ కానీ, ఎక్స్ట్రా పెగ్ కానీ వేసుకోవాలని అన్నారు. దీనిపై లక్ష్మి స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. మహిళలకు బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. బీజేపీ రహస్య ఎజెండా ఇదేనన్నారు. జై శ్రీరామ్ అని నినాదాలు చేయడంతో సరిపోదని, మహిళలను గౌరవించాలని హితవు పలికారు.