Kiran Majumdar Shaw |కర్ణాటకలో హిందూ దేవాలయాల వద్ద ముస్లిం వ్యాపారులపై నిషేధం విధించాలన్న హిందూ సంస్థల పిలుపుపై ప్రముఖ కార్పొరేట్ సంస్థ బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్షా స్పందించారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న మత విభజనను పరిష్కరించాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మెని కోరారు. ఐటీ రంగానికి మతం రంగు పులిమితే.. భారత్కు ఉన్న గ్లోబల్ లీడర్షిప్ గౌరవం ధ్వంసం అవుతుందని పేర్కొన్నారు. కిరణ్ మజుందార్షా వ్యాఖ్యలపై కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ఘాటుగా స్పందించింది. ఆమె రాజకీయ రంగు పులుముతున్నారని వ్యాఖ్యానించింది.
పాత చట్టం ప్రకారమే కర్ణాటకలోని దేవాలయాల వద్ద హిందూయేతరులు వ్యాపారాలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేవాలయాల వద్ద మతపరమైన మినహాయింపు ఇవ్వాలని బహిరంగంగా స్పందించిన తొలి కార్పొరేట్ అధినేతగా కిరణ్ మజుందార్షా నిలిచారు.
కర్ణాటక ఎల్లవేళల సమగ్ర అభివృద్ధి సాధిస్తుంది. మనం తప్పనిసరిగా ఇటువంటి మతపరమైన మినహాయింపులు అనుమతించొద్దు. ఒకవేళ మతపరమైన విభజనను అనుమతి ఇస్తే ఐటీబీటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ) మత రంగు పులుముకుంటుంది. ఇది మన గ్లోబల్ లీడర్షిప్ను ధ్వంసం చేస్తుంది. బీఎస్ బొమ్మాయ్ గారూ.. దయచేసి పెరిగిపోతున్న మత విభజనను పరిష్కరించండి అని కిరణ్ మజుందార్ షా ట్వీట్ చేశారు.
కిరణ్ మజుందార్ షా ట్వీట్పై నెటిజన్ స్పందించారు. కిరణ్ మజుందార్షా, సీఎం బొమ్మాయ్లను ట్యాగ్ చేస్తూ.. ఈ మతపరమైన విభజనను పెంచుతారు. మన కండ్ల ముందే కర్ణాటక పడిపోవడం ఖాయం` అని పేర్కొన్నారు. దీనిపైన స్పందించిన కిరణ్.. రాష్ట్ర సీఎం బొమ్మాయ్ చాలా ప్రగతిశీల నాయకుడు. త్వరలోనే దీన్ని పరిష్కరిస్తారు అని తెలిపారు.
కిరణ్ మజుందార్ ట్వీట్పై బీజేపీ ఐటీ సెల్ అధినేత అమిత్ మాల్వియా ఘాటుగా రియాక్టయ్యారు. ఆమె రాజకీయ పక్షపాతం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.కిరణ్ మజుందార్ షా వంటి కొందరు వ్యక్తులు తమ వ్యక్తిగత, రాజకీయ అభిప్రాయాన్ని రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో రాహుల్ బజాజ్ కూడా గుజరాత్పై ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. కానీ ఇప్పుడు గుజరాత్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరింగ్ హబ్గా అవతరించిందని గుర్తు చేశారు.