బీజేపీ తిరుగుబాటు నేత వరుణ్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో జోరుగా సాగుతున్న ప్రైవేటీకరణను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇలా ప్రైవేటీకరణ చేస్తే.. చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారని ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘కేవలం బ్యాంకింగ్ రంగం, రైల్వేలను ప్రైవేటీకరణ చేస్తేనే.. దాదాపు 5 లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఒక్కరు ఉపాధి కోల్పోయారంటే.. ఆ కుటుంబంలోని వారందరి ఆశలూ అడియాసలే. ఇక వారి కలలు కల్లలే అయిపోతాయి. ప్రజా సంక్షేమ ప్రభుత్వాలు ఎప్పుడూ ఆర్థిక అసమానతలను సృష్టించవు. పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహించవు’ అంటూ వరుణ్ ట్వీట్ చేశారు.