న్యూఢిల్లీ: సొంత పార్టీపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి మరోసారి విమర్శల దాడికి దిగారు. బుధవారం చేపట్టిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు పునర్వ్యవస్థీకరణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ అప్రజాస్వామికంగా ఉన్నదని మండిపడ్డారు. ‘పార్టీ పదవుల నియామకానికి గతంలో పార్లమెంటరీ పార్టీ ఎన్నికలు జరిగేవి. దీనికోసం పార్టీ రాజ్యాంగం అవసరమయ్యేది. అయితే, ప్రస్తుత బీజేపీలో ఎన్నికల ఊసే లేదు. ప్రతి పదవి కూడా నామినేటెడ్ పోస్టే. ప్రధాని మోదీ ఆమోదం ఉంటే పోస్టు లభించినట్టే’ అని విరుచుకుపడ్డారు.