ముంబై: మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ను అగౌరవపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన బీజేపీ నేత చెంపపై ఆ పార్టీ కార్యకర్త కొట్టాడు. మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వినాయక్ అంబేకర్, ఎన్సీపీ చీప్ శరద్ పవార్కు వ్యతిరేకంగా ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఎన్సీపీ కార్యకర్తలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు వినాయక్ అంబేకర్ కార్యాలయానికి వెళ్లి దీనిపై ఆయనను నిలదీశారు. దీంతో వాగ్వాదం జరిగింది. ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన ఒక ఎన్సీపీ కార్యకర్త బీజేపీ నేత వినాయక్ చెంప చెళ్లుమనిపించాడు. ఈ వీడియో వైరల్ అయ్యింది.
మరోవైపు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి వినాయక్ అంబేకర్పై ఎన్సీపీ గూండాలు దాడి చేశారని ఆరోపించారు. బీజేపీ తరుఫున తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. దాడి చేసిన ఎన్సీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, శరద్ పవార్ను అవమానించేలా ఫేస్బుక్లో పోస్టులు పెట్టిన మరాఠీ నటి కేత్కి చితాలే, విద్యార్థి నిఖిల్ భామ్రేపై కేసులు నమోదు చేసిన పోలీసులు శనివారం వారిద్దరిని అరెస్ట్ చేశారు. నటి కేత్కిని థానే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా మే 18 వరకు పోలీస్ కస్టడీ విధించింది. విద్యార్థి నిఖిల్ను నాసిక్ పోలీసులు అరెస్ట్ చేశారు.
महाराष्ट्र प्रदेश भारतीय जनता पार्टीचे प्रवक्ते प्रा. विनायक आंबेकर यांच्या वर राष्ट्रवादीच्या गुंडांनी भ्याड हल्ला केला असून, भाजपाच्या वतीने मी या हल्ल्याचा तीव्र शब्दांत निषेध व्यक्त करतो. राष्ट्रवादीच्या या गुंडांवर तात्काळ कारवाई झालीच पाहिजे !@BJP4Maharashtra pic.twitter.com/qR7lNc1IEN
— Chandrakant Patil (@ChDadaPatil) May 14, 2022