లక్నో: ఇరుగుపొరుగు పిల్లల మధ్య గొడవ జరిగింది. దీని పట్ల ఇరు కుటుంబాలు క్షమాపణలు చెప్పుకున్నాయి. అయితే ఈ వివాదం నేపథ్యంలో ఆ పిల్లలకు చెందిన బీజేపీ నాయకురాలిపై స్థానికులు కర్రలతో దాడి చేశారు. (BJP Leader Beaten) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఈ సంఘటన జరిగింది. లక్ష్మీ కాలనీ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకురాలు భావనా బిష్త్ పిల్లలు, పొరుగింటికి చెందిన పిల్లలు గురువారం కొట్టుకున్నారు. ఆ తర్వాత ఈ రెండు కుటుంబాలు పరస్పరం క్షమాపణలు చెప్పుకున్నాయి.
కాగా, శుక్రవారం ఉదయం బీజేపీ నాయకురాలు భావనా, స్థానికుల మధ్య ఈ వివాదంపై మళ్లీ గొడవ జరిగింది. వాగ్వాదం ముదరడంతో వారి మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు కర్రలతో భావనా, ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ దాడిలో తన చేతికి గాయమైందని ఆమె ఆరోపించింది. అయితే ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#गाजियाबाद
लोनी बार्डर थाना क्षेत्र की लक्ष्मी गार्डन कालोनी में रहने वाले उत्तराखंड के परिवार के साथ दबंगों ने जमकर मारपीट की,बीती रात हुए मामूली कहासुनी के बाद परिवार ने माफी भी मांग ली थी लेकिन दबंगों ने सुबह फिर घर से बाहर बुलाकर @BJP4UP की महिला कार्यकर्ता के साथ पति और… pic.twitter.com/oaynW9Kt7p— Yashpal Kasana (@KasanaYashpal) December 20, 2024