భోపాల్: గిరిజన వ్యక్తిని బీజేపీ నాయకుడు చెప్పుతో కొట్టాడు. (BJP Leader Assaults Tribal Man) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని అనుప్పూర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం బైక్ ప్రమాదంలో 60 ఏళ్ల భోమా సింగ్ మరావి మరణించాడు. ఆ బైక్ నడిపిన మృతుడి బంధువు బర్ను సింగ్ మరావి షాక్తో మృతదేహం పక్కన కూర్చొన్నాడు.
కాగా, కొందరు వ్యక్తులు అక్కడకు చేరుకున్నారు. బంధువు మరణించిన షాక్లో ఉన్న గిరిజన వ్యక్తి బర్ను సింగ్ను జితేంద్ర కుష్వాహ అనే వ్యక్తి ప్రశ్నించాడు. సమాధానం చెప్పకపోవడంతో స్థానిక బీజేపీ నాయకుడు జైగణేష్ దీక్షిత్ ఆ గిరిజన వ్యక్తిని చెప్పుతో కొట్టాడు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్నాథ్ మండిపడ్డారు. రాష్ట్రంలోని దళితులు, గిరిజనులపై దాడులను నిలువరించలేకపోతున్న శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, జైగణేష్ దీక్షిత్ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఆ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాందాస్ పూరి తెలిపారు.
शिवराज सिंह चौहान जी आप यह वीभत्स वीडियो देखकर अनदेखा नहीं कर सकते। अनूपपुर जिले में एक आदिवासी व्यक्ति के शव के बगल में भारतीय जनता पार्टी का नेता दूसरे आदिवासी व्यक्ति को चप्पल से पीट रहा है। मध्य प्रदेश में भारतीय जनता पार्टी, आदिवासी अत्याचार पार्टी बनती जा रही है।
आखिर आप… pic.twitter.com/tb9PENDuNr
— Kamal Nath (@OfficeOfKNath) September 20, 2023