బీజేపీ పేద్ద చెత్త పార్టీ: మమతాబెనర్జి

కోల్కతా: రైతుల ఆందోళనపై బీజేపీ మొండి వైఖరి కారణంగా దేశంలో ఆహార సంక్షోభం తలెత్తే పరిస్థితి నెలకొని ఉన్నదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి విమర్శించారు. భారత్లో ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉన్నది. రైతుల విషయంలో బీజేపీ మొండి వైఖరి ఇలాగే కొనసాగితే దేశంలో ఆహార కొరత ఏర్పడటం ఖాయం. రైతులు మన దేశానికి ఆస్తులు. అందువల్ల మనం రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నడుచుకోవడం కరెక్టు కాదు అని మమతాబెనర్జి వ్యాఖ్యానించారు.
అంతేగాక బీజేపీ ఒక చెత్త పార్టీ అని మమతాబెనర్జి మండిపడ్డారు. బీజేపీ పేద్ద చెత్త పార్టీ. అవినీతిపరులు, ఎందుకు పనికిరాని నాయకులతో నిండిపోతున్న ఓ చెత్తకుప్పలా బీజేపీ మారింది. బీజేపీ నేతలు పార్టీని ఒక వాషింగ్ మిషన్లాగా నడుపుతున్నారు. ఇతర పార్టీలు దూరం పెట్టిన అవినీతిపరులను తమ పార్టీలో చేర్చుకుంటూ వారిని సత్పురుషులు, సాధువులుగా కొనియాడుతున్నారు అంటూ మమత ఆగ్రహం వ్యక్తంచేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- హస్తిన సరిహద్దుల్లో అదనపు బలగాలు!
- హర్యానా, పంజాబ్ల్లో హైఅలర్ట్
- వ్యాక్సిన్ కోసం కెనడా సంస్థ సీఈవో కొలువు ఖల్లాస్
- ఉరేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
- సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
- ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం..83 మంది పోలీసులకు గాయాలు
- కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిక
- మహవీర్ చక్రతో వందశాతం సంతృప్తి చెందట్లేదు: సంతోష్ తండ్రి
- అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
- నూతన సచివాలయం, అమరవీరుల స్మారకంపై మంత్రి వేముల సమీక్ష