భోపాల్: మధ్యప్రదేశ్లో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్(CM Shivraj Singh chouhan) అన్నారు. ఇవాళ ఆయన తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుబడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ పార్టీ మ్యాజిక్ మార్క్ను దాటేసింది. 149 స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నది. శివరాజ్ సింగ్ తన ట్వీట్లో భారత్ మాతాకీ జై, జనతా జనార్దన్కి జై అంటూ తెలిపారు. ప్రజల ఆశ్వీర్వాదంతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం శివరాజ్ తెలిపారు.
‘भारत माता की जय, जनता जनार्दन की जय’
आज मध्यप्रदेश विधानसभा चुनाव के नतीजे आ रहे हैं और मुझे विश्वास है कि जनता के आशीर्वाद व आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के कुशल नेतृत्व में भारतीय जनता पार्टी पूर्ण बहुमत के साथ फिर सरकार बनाने जा रही है।
भाजपा के सभी…
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) December 3, 2023