న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను బీజేపీ ఇటీవల లక్ష్యంగా చేసుకుంటున్నది. ఈ నేపథ్యంలో శనివారం ఆయన అధికార నివాసం వెలుపల భారీ నిరసన చేపట్టింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్పై ఇంధన పన్నును తగ్గించాలని బీజేపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా మోహరించిన పోలీసులు బీజేపీ నిరసనకారులను అడ్డుకున్నారు.
మరోవైపు దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు, పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం సీఎంలనుద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. అయితే లైవ్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమావేశం మధ్యలో ఒకసారి కుర్చీలో వెనక్కి వాలి రెండు చేతులు తలవెనుక పెట్టుకున్నారు.
దీంతో ప్రధాని మోదీ ప్రసంగాన్ని పట్టించుకోన్నట్లుగా, అగౌరవ పరిచేలా అరవింద్ కేజ్రీవాల్ వ్యవహరించినట్లు బీజేపీ మండిపడింది. ‘మేనర్లెస్ ఢిల్లీ సీఎం’ అని విమర్శించింది. ఈ మేరకు బీజేపీ అధికార ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేసింది.