న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భారీస్థాయిలో ఆస్తులను కూడబెట్టింది. జాతీయ పార్టీల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎనిమిది పార్టీలు ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ రూ.8,829 కోట్లు ఉండగా..
వాటిల్లో సింహభాగం రూ.6,046 కోట్లు(దాదాపు 68 శాతం) బీజేపీవే అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) సోమవారం వెలువరించిన నివేదికలో వెల్లడించింది. సంవత్సరం వ్యవధిలో బీజేపీ ఆస్తులు రూ.4,990 కోట్ల నుంచి 21.17 శాతం పెరిగి రూ.6,046 కోట్లకు చేరాయని పేర్కొన్నది. తర్వాతి స్థానంలో కాంగ్రెస్ ఉన్నదని తెలిపింది.