పాట్నా, ఆగస్టు 23: బీహార్లోని గయాలో ఉన్న పురాతన విష్ణుపహాడ్ మందిరాన్ని ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్తో కలిసి మంత్రి మహమ్మద్ ఇస్రాయిల్ మన్సూరీ దర్శించారు. గర్భగుడిలోకి వెళ్లి పూజలు నిర్వహించారు. గుడిలోకి వెళ్లి భగవంతుడిని దర్శించడం అదృష్టంగా మన్సూరీ అభివర్ణించారు. అయితే దీనిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. నితీశ్ కావాలనే హిందువుల మత విశ్వాసాలను అవమానించారని విరుచుకుపడ్డారు. అందుకే ముస్లిం వ్యక్తిని గుడిలోకి తీసుకెళ్లారన్నారు.