ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) ఆర్ఎస్ఎస్ కంచుకోట అయిన నాగపూర్లో ఆదివారం రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక భవనంపై ఉన్న బీజేపీ మద్దతుదారులు ఆ పార్టీ జెండాలను ఊపి నినాదాలు చేశారు. ఇది చూసి కాంగ్రెస్ మద్దతుదారులు కూడా తమ పార్టీ నినాదాలు చేశారు.
కాగా, ప్రియాంక గాంధీ చిరునవ్వుతో దీనిపై స్పందించారు. బుధవారం జరుగనున్న పోలింగ్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మైక్ తీసుకొని వారినుద్దేశించి ఆమె మాట్లాడారు. ‘బీజేపీ మిత్రులారా, మీకు ఎన్నికల శుభాకాంక్షలు. కానీ మహా వికాస్ అఘాడీ గెలుస్తుంది’ అని అన్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
మరోవైపు ప్రియాంక గాంధీ రోడ్షో తర్వాత నాగ్పూర్ సెంట్రల్ కాంగ్రెస్ అభ్యర్థి బంటీ షెల్కే, ఆ బీజేపీ మద్దతుదారుల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఈ విషయం బయటకు రానివ్వలేదని సమాచారం.
కాగా, బీజేపీ సైద్ధాంతిక మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగపూర్లో ఉంది. దీంతో ఈ నగరాన్ని బీజేపీ కంచు కోటగా పరిగణిస్తారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 2014 నుంచి వరుసగా నాగపూర్ లోక్సభ స్థానం నుంచి విజయం సాధించారు. అలాగే ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు స్థానాలు ప్రస్తుతం బీజేపీ చేతిలో ఉన్నాయి.
गढ़ में घुस कर ललकारना इसे कहते हैं
नागपुर में गरजीं @priyankagandhi
RSS और भाजपा वालों शुभकामनाएँ लेकिन जीतेगी तो महाविकास आघाड़ी ही! pic.twitter.com/YMj5ynuvpg
— Supriya Shrinate (@SupriyaShrinate) November 17, 2024