రాయ్పూర్ : ఛత్తీస్ఘఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Chhattisgarh Polls) బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటి విజయం దిశగా సాగుతోంది. సీఎం భూపేష్ బఘేల్పై మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఆరోపణలు వెల్లువెత్తడం కాంగ్రెస్ విజయావకాశాలకు గండికొట్టింది. 90 స్ధానాలు కలిగిన చత్తీస్ఘఢ్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 46ను సునాయాసంగా అధిగమించి 54 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, పాలక కాంగ్రెస్ 35 స్ధానాలకు పరిమితమైంది.
మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కాంగ్రెస్ కొంపముంచిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల ప్రచార ర్యాలీల్లోనూ ప్రధాని నరేంద్ర మోదీ పలుమార్లు మహదేవ్ స్కామ్ను ప్రస్తావించి భూపేష్ బఘేల్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.
ఈ స్కామ్లో చత్తీస్ఘఢ్ సీఎం సన్నిహితుడు జైలులో ఉన్నాడని కూడా ప్రచార ర్యాలీలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆరోపించారు. ఇక రూ. 508 కోట్ల విలువైన మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్కు సంబంధించి దర్యాప్తు సంస్ధలు పెద్దమొత్తంలో లెక్కతేలని నగదును స్వాధీనం చేసుకుంది.