న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణి కారు దొంగతనానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కారును డ్రైవర్ జోగిందర్ దక్షిణ ఢిల్లీలోని గోవింద్ పురిలో ఉన్న ఓ సర్వీస్ సెంటర్ వద్ద ఈ నెల 19న పెట్టారని, అక్కడి నుంచి ఆయన ఇంటికి వెళ్లి, తిరిగి వచ్చి చూసేసరికి ఆ కారు కనిపించలేదని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించినపుడు ఈ కారు గురుగ్రామ్ వైపు వెళ్తుండగా చివరిసారి కనిపించిందన్నారు. ఇప్పటి వరకు దాని ఆచూకీ లభించలేదని తెలిపారు.