కోల్కతా: కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ఓ యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ బాధితురాలి తల్లి రత్నా దేబనాథ్(Ratna Debnath) బీజేపీ టికెట్పై పోటీ చేశారు. పాణిహట్టి సీటు నుంచి ఆమె ఎన్నికల్లో నిలిచారు. తాజా సమాచారం ప్రకారం రత్నా దేబనాథ్.. వెనుకంజలో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి తీర్థాంకర్ ఘోష్ .. ఆ స్థానం నుంచి లీడింగ్లో ఉన్నారు. ఆర్జీ కార్ కాలేజీ బాధితురాలి తల్లి వెనుకంజలో ఉన్నా.. బీజేపీ పార్టీ మాత్రం ఆ రాష్ట్రంలో ముందంజలో కొనసాగుతున్నది. తాజా ఫలితాల ప్రకారం బీజేపీ 194 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. తృణమూల్ కాంగ్రెస్ 96 స్థానాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. పశ్చిమ బెంగాల్లో మహిళల పట్ల హింస పెరుగుతోందని రత్నా దేబనాథ్ ఎన్నికల వేళ ప్రచారం నిర్వహించారు. ఈ అంశంపై ఆమె పోరాటం చేసినా.. ఎన్నికల్లో మాత్రం ఓట్లను రాబట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది.