UP Polls | బీజేపీ మిత్ర పక్షాలైన అప్నాదళ్, నిషాద్ పార్టీలు అనుకున్న పంతం సాధించాయి. ఇరు పార్టీలూ రెండెకల స్థానాలు కావాల్సిందేనని బీజేపీని గట్టిగా పట్టుపట్టాయి. చివరికి వీరి మధ్య సీట్ల పంపకం పూర్తైంది. నిషాద్ పార్టీకి 15 సీట్లు, అప్నాదళ్కు 18 నుంచి 20 స్థానాలు ఇవ్వడానికి బీజేపీ రెడీ అయిపోయింది. తమకు 15 సీట్లు ఇవ్వడానికి బీజేపీ అంగీకరించింది. దాదాపుగా ఇదే ఫైనల్. పూర్వాంచల్, పశ్చిమాంచల్లోనే అత్యధిక శాతం ఉన్నాయి. ఈసారి సమీకరణాలను కచ్చితంగా మార్చేస్తాం. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతాం అని నిషాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిషాద్ ప్రకటించారు.
కొన్ని రోజుల క్రితం బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్షా, యూపీ సీఎం యోగి, డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్యతో పాటు పలువురు సీనియర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమకు రెండంకెల సీట్లు కావాలని బీజేపీ మిత్రపక్షాలైన అప్నాదళ్, నిషాద్ పార్టీ అమిత్షాను డిమాండ్ చేశాయి.