భువనేశ్వర్: ఒడిశాలో నబా కిషోర్ దాస్ మరణంతో ఖాళీ అయిన ఝార్సుగూడ (Jharsuguda) అసెంబ్లీ స్థానానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఉప ఎన్నికలు (by elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేడీ (BJD).. హత్యకు గురైన మాజీ మంత్రి నబా కిషోర్ దాస్ (Naba Kishore Das) కుమార్తె దీపాలీ దాస్ (Deepali Das)కు ఝార్సుగూడ టికెట్ను ఖరారు చేసింది. ఝార్సుగూఢ బీజేపీ అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఒడిశా ఆరోగ్య శాఖ మాజీ మంత్రి నబా కిషోర్ హత్యకు గురవడంతో ఝార్సుగూడ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఆయనను గత నెల 29న ఒక అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ASI) స్థాయి పోలీస్ అధికారి కాల్చిచంపాడు. ఓ సమావేశంలో పాల్గొనేందుకు ఝార్సుగూడ జిల్లాలోని బబ్రాజనగర్ (Babrazanagar)కు వెళ్లిన నబా కిషోర్ దాస్ తన కారులోంచి దిగగానే నిందితుడు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయాడు.
ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నబా కిషోర్ దాస్ భువనేశ్వర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆయన 2009 నుంచి వరుసగా ఝార్సుగూడ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందుతూ వచ్చారు. 2009, 2014, 2019లలో వరుసగా మూడుసార్లు విజయం ఆయననే వరిస్తూ వచ్చింది. ఆయన మరణంతో ఇప్పుడు ఆ స్థానం నుంచి ఆయన కుమార్తె దీపాలీ దాస్ను బీజేడీ బరిలోకి దించింది.
Biju Janta Dal (BJD) announces the name of Dipali Das, daughter of late Odisha Health Minister Naba Kishore Das, as the party’s candidate for the by-election to Jharsuguda Assembly constituency. pic.twitter.com/aMhSvgDyPf
— ANI (@ANI) March 31, 2023