న్యూఢిల్లీ : హైదరాబాద్కు చెందిన ఫార్మా కంపెనీ బయలాజికల్ ఈ భారత్లో సెప్టెంబర్ మాసాంతానికి కొవిడ్ వ్యాక్సిన్ కొర్బివ్యాక్స్ను అందుబాటులోకి తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ తొలి, మలి క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తికావడంతో ఇటీవలే మూడవ దశ క్లినకల్ ట్రయల్స్ను కంపెనీ చేపట్టింది. దేశీ వ్యాక్సిన్లను ముమ్మరంగా ప్రవేశపెట్టాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మిషన్ కొవిడ్ సురక్ష పేరిట ఐదారు కొవిడ్-19 వ్యాక్సిన్లను ప్రోత్సహించాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది.
క్లినికల్ ట్రయల్స్ చేపట్టక ముందు నుంచి మూడో దశ పరీక్షల వరకూ బయలాజికల్ ఈ వ్యాక్సిన్కు కేంద్ర ప్రభుత్వం అన్నవిధాలుగా బాసటగా నిలిచింది. ఇక దేశంలో ప్రస్తుతం కొవిషీల్డ్, కొవ్యాక్సిన్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 43.51 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందచేశారు. మరోవైపు 12-18 ఏండ్ల వయసు వారికి సెప్టెంబర్ నుంచి జైడస్ క్యాడిలా కొవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.