బిలాస్పూర్: ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్-జైరాంనగర్ మార్గంలో ఇటీవల ఒక ప్యాసింజర్, గూడ్స్ రైలు ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చాయి. లోకో పైలట్లు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై రైల్వే శాఖ వివరణ ఇచ్చింది. ఎదురెదురుగా రెండు రైళ్లు వచ్చేందుకు అనుమతి ఉన్నదని, ఒకే ట్రాక్పైకి రెండు రైళ్లు వచ్చినా అవి ఢీ కొట్టుకోవని, సిగ్నల్ పడి కొద్ది దూరంలో నిలిచిపోతాయని వివరణ ఇచ్చింది.