Bikaner-Guwahati train mishap | బికనీర్- గువాహాటి ఎక్స్వద్ద పట్టాలు తప్పిన ప్రదేశాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ శుక్రవారం సందర్శించారు. ప్రమాద వివరాలు, జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్యం.. తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరో వైపు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వడం ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు.
మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి లక్ష, స్వలంగా గాయపడిన వారికి 25 వేల రూపాయలను ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే లోకోమోటివ్ పరికరాల్లో ఏర్పడ్డ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. అసలు ఈ ప్రమాదానికి మూలం ఏమిటన్న కోణాన్ని కూడా లోతుగా అధికారులు పరిశీలిస్తున్నారని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు.
గౌహతి- బికనేర్ ఎక్స్ప్రెస్ గురువారం బెంగాల్లోని జల్పాయ్ గుడి జిల్లా దగ్గర పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో 9 మంది మృతి చెందగా, 45 మందికి పైగా గాయపడ్డారు. సాయంత్రం 5 గంటల సమయంలో కొన్ని బోగీలు బోల్తాపడగా, మరికొన్ని పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో మొత్తం 12 బోగీలు దెబ్బతిన్నాయి. శుక్రవారం కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.