పాట్నా: బీహార్ నాయకుడు పప్పు యాదవ్ (Pappu Yadav) లోక్సభ ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నారు. జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. బుధవారం ఢిల్లీలో అధికారికంగా ఆ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆశీస్సులతో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినట్లు పప్పు యాదవ్ తెలిపారు. ప్రస్తుతం రాహుల్ గాంధీని మించిన ప్రత్యామ్నాయం లేదంటూ ఆయనను ప్రశంసించారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. లాలూ, కాంగ్రెస్తో కలిసి లోక్సభ ఎన్నికలతోపాటు 2025లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని అన్నారు.
కాగా, పప్పు యాదవ్ గతంలో ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ, లోక్ జనశక్తి పార్టీలో ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా ఆర్జేడీ నుంచి ఆయనను బహిష్కరించారు. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కూటమికి వ్యతిరేకంగా జన్ అధికార్ పార్టీని ఆయన స్థాపించారు.
మరోవైపు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్ను పప్పు యాదవ్ మంగళవారం కలిశారు. దీంతో ఆయన ఆర్జేడీ గూటికి తిరిగి రావచ్చన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన పప్పు యాదవ్ ఆ పార్టీలో చేరారు.