పాట్నా: రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళ ఇద్దరు పిల్లలతోపాటు ప్లాట్ఫారమ్ నుంచి రైలు పట్టాల వద్ద పడింది. ఆ రైలు కదలడంతో పిల్లలను కాపాడుకునేందుకు ఆమె ప్రయత్నించింది. (woman and her two children miraculously survived) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్లోని బెగుసరాయ్కు చెందిన మహిళ తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లేందుకు బార్హ్ రైల్వే స్టేషన్కు శనివారం చేరుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి విక్రమశిలా ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తోపులాటలో ఇద్దరు పిల్లలతో పాటు ప్లాట్ఫారమ్ నుంచి రైలు పట్టాల వద్ద పడింది.
కాగా, ఆ రైలు స్టేషన్ నుంచి కదిలింది. అయితే రైలు పట్టాల వద్ద పడిన ఆ మహిళ తన ఇద్దరు పిల్లలను కాపాడుకునేందుకు ప్రయత్నించింది. వారిని గట్టిగా పట్టుకుని ప్రమాదం బారిన పడకుండా రక్షించుకుంది. అదృష్టవశాత్తు ఆ మహిళ, పసి పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు.
మరోవైపు రైలు వెళ్లిన తర్వాత ప్లాట్ఫారమ్పై ఉన్న కొందరు వెంటనే కిందకు దిగారు. రైలు పట్టాల వద్ద పడిన మహిళ, ఆమె పిల్లలను ప్లాట్ఫారమ్ పైకి చేర్చారు. స్వల్ప గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
मौत के सामने जीती मां की ममता. #Bihar के #Barh रेलवे स्टेशन से वीडियो. भीड़ में मां, दो बच्चों संग पटरी पर गिरी. ट्रेन चलने लगी. 3 जिंदगियों के सामने मौत खड़ी थी. और दूसरी तरफ मां. उधर ट्रेन की रफ्तार थी. तो इधर मां की ममता. 25 सेकेंड बाद मां जीती. मौत हारी. #viralvideo #barh pic.twitter.com/bsDxbD0EFS
— Sunil Maurya (@smaurya_journo) December 24, 2023