పాట్నా: రైళ్లలో దొంగతనాలకు పాల్పడే ఒక దొంగ రైలు నుంచి ప్రమాదకరంగా వేలాడాడు. ప్రయాణికులు అతడ్ని లోపలికి లాగి చితక్కొట్టారు. బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జమాల్పూర్-సాహిబ్గంజ్ ప్యాసింజర్ రైలు లైలాఖ్, ఘోఘా స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది. రైల్వే స్టేషన్ నుంచి కదులుతున్న రైలులో చోరీకి ఒక దొంగ ప్రయత్నించాడు. రైలు బోగి కిటికీ నుంచి చేతిని లోపలికి పెట్టి సెల్ ఫోన్ను లాక్కోబోయాడు.
అయితే గమనించిన ప్రయాణికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ దొంగ చేతిని, అతడు ధరించిన టీ షర్టును గట్టిగా పట్టుకున్నారు. దీంతో ఆ దొంగ రైలు బోగి కిటికీ బయట వైపు ప్రమాదకరంగా కొంతసేపు వేలాడాడు. తన ప్రాణాలు కాపాడాలంటూ ప్రాధేయపడ్డాడు. చివరకు ప్రయాణికులు ఆ దొంగను రైలు బోగిలోకి లాగారు. అనంతరం అతడ్ని చితకబాదారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నెల 14న బీహార్లోని బెగుసరాయ్ జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది.
#Bihar : चोर गिड़गिड़ाता रहा, लोगों ने ट्रेन से बाहर लटकाए रखा, खूब वायरल हो रहा वीडियो pic.twitter.com/7w4QA0Xhb5
— NDTV India (@ndtvindia) September 29, 2022