బీహార్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన జరిగింది. ‘మధ్యాహ్న భోజనం పెట్టడం లేదు.. టీచర్లు పాఠాలు చెప్పకుండా మసాజ్ చేయమంటున్నారు’ అని ఆరోపిస్తూ పాఠశాల విద్యార్థులు తిరగబడ్డారు. తరగతులను బహిష్కరించారు. ప్రభుత్వ పాఠశాల ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ వీడియో సోషల్మీడియాలో చక్కర్లుకొడుతోంది.
బీహార్లోని కతిహార్ జిల్లా బార్సోయి బ్లాక్ అబాద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరియాల్ అప్గ్రేడ్ మిడిల్ స్కూల్లో ఈ సంఘటన జరిగింది. మధ్యాహ్న భోజన పథకం అమల్లో తేడాలున్నాయని ఆరోపిస్తూ విద్యార్థులు గొడవకు దిగారు. పాఠశాల ఆస్తులను ధ్వంసం చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందించడం లేదని, టీచర్లు పాఠాలు బోధించకుండా మసాజ్ చేయాలని బలవంతం చేశారని వారు ఆరోపించారు. విద్యార్థులను గ్రామస్తులే రెచ్చగొట్టారని స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసింది. కాగా, ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం స్పందించింది. విచారణకు ఆదేశించింది.
कटिहार के स्कूल में ‘मिड-डे मील’ के नाम पर बच्चों का बवाल, किसने भड़काया ? #Katihar #MiddayMeal #BiharNews pic.twitter.com/Sqa6savA3E
— Zee Bihar Jharkhand (@ZeeBiharNews) July 9, 2022