పట్నా: ఆర్జేడీ హయాంలోలా బీహార్లో తాము నేరగాళ్లకు కొమ్ముకాయమని ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. బీహార్లోని ఎన్డీఏ సర్కారు నేరస్తులను చీల్చి చెండాడుతుందని, ఆర్జేడీ సర్కారులా వాళ్లకు రక్షణ కల్పించదని బీహార్ రోడ్డు నిర్మాణ శాఖ మంత్రి నితిన్ నబిన్ ( Bihar minister Nitin Nabin ) అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నదని ప్రతిపక్ష ఆర్జేడీ అగ్రనేత తేజస్వియాదవ్ ఈ ఉదయం బీహార్ సర్కారుపై విమర్శలు చేశారు.
బీహార్లోని బేనిపట్టిలో ఇటీవల ఓ జర్నలిస్టును కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చారు. దాంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేకపోవడంవల్లే ఇలా జరిగిందని తేజస్వి మండిపడ్డారు. అయితే తేజస్వి వ్యాఖ్యలను ఆ రాష్ట్ర మంత్రి నితిన్ నిబిన్ తిప్పికొట్టారు. తాము రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడుతూనే అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఆర్జేడీ ప్రభుత్వంలా తాము క్రిమినల్స్కు రక్షణ కల్పించి ఇండ్లలో కూర్చొబెట్టమని అన్నారు. తస్ముద్దీన్, సహాబుద్దీన్ లాంటి క్రిమినల్స్ను చట్టసభలకు పంపిన చరిత్ర ఆర్జేడీది అని మండిపడ్డారు.