Ex CBI special judge | పశుగ్రాసం స్కామ్లో రెండు కేసుల్లో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు శిక్ష విధించిన మాజీ ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి శివ్పాల్ సింగ్ (59) తన కంటే తొమ్మిదేండ్ల యువతి, బీజేపీ నేతను పెండ్లాడారు. గొడ్డా జిల్లా కోర్టులో నూతన్ తివారీ (50) న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ప్రాంత బీజేపీ నాయకురాలిగా నూతన్ తివారీ పేరున్న నేత. మూడేండ్లుగా శివ్ పాల్సింగ్ గొడ్డా జిల్లా సెషన్స్ కోర్ట్-1 అదనపు న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వారిద్దరూ దుమ్కా జిల్లాలోని బాసుకినాథ్ దేవాలయంలో పెండ్లి చేసుకున్నారు.
2006లో జడ్జి శివ్పాల్ సింగ్ భార్య చనిపోయారు. ఆయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. నూతన్ తివారీ కొన్నేండ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తన భర్తను కోల్పోయారు. ఆమెకు ఒక కూతురు ఉన్నారు. శివ్ పాల్ సింగ్, నూతన్ తివారీల వివాహానికి వారి కుటుంబాలు, పిల్లలు ఆమోదం తెలిపాకే పెండ్లి చేసుకున్నారని నూతన తివారీ సన్నిహితులు చెప్పారు.
ఉత్తరప్రదేశ్కు చెందిన జడ్జి శివ్పాల్ సింగ్ వచ్చే మార్చి 31న జార్ఖండ్లోని జ్యుడిషియల్ సర్వీస్ నుంచి రిటైర్ కానున్నారు. రాంచీ జిల్లా సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా శివ్ పాల్ సింగ్.. పశుగ్రాసం స్కామ్లో రెండు కేసులకు లాలూ ప్రసాద్ యాదవ్కు 14 ఏండ్ల జైలుశిక్ష విధించారు.