పాట్నా: బీహార్ రాజకీయాలు ఒక్క రోజులో మారిపోయాయి. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం నుంచి తప్పుకున్న నితీశ్ కుమార్ తిరిగి బీజేపీకి దగ్గరయ్యారు. ఆదివారం 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీయేతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. బీజేపీ నేతలు డిప్యూటీ సీఎంలు అయ్యారు. ఈ పరిణామాలతో నిన్నటి వరకు డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) మాజీ అయ్యారు. దీంతో పాట్నాలోని తేజస్వీ యాదవ్ ఇంటి ముందు ఉన్న ‘బీహార్ డిప్యూటీ సీఎం’ నేమ్ బోర్డును న్యూస్పేపర్తో కవర్ చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, తిరిగి బీజేపీతో జతకట్టిన సీఎం నితీశ్ కుమార్పై తేజస్వీ యాదవ్ ఆదివారం మండిపడ్డారు. ఇప్పుడే ఆట మొదలైందని, నితీశ్ కుమార్ పార్టీ జేడీ(యూ) 2024లోనే అంతమవుతుందని అన్నారు. అలాగే నితీశ్ కుమార్ చేతకాని, అలసిపోయిన సీఎం అని విమర్శించారు. ఆయనకు ఎలాంటి విజన్ లేదని ఆరోపించారు.
"Bihar Deputy CM" written on the nameplate outside the residence of RJD leader Tejashwi Yadav in Patna has been covered with newspapers.
Bihar Chief Minister Nitish Kumar yesterday broke ties with the RJD-led Mahagathbandhan and formed the government with the BJP-led NDA. pic.twitter.com/m2hPnQPrY1
— ANI (@ANI) January 29, 2024