Nitish Kumar | బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వానీ (LK Advani )ని బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM), జేడీయూ నేత నితీశ్ కుమార్ (Nitish Kumar) కలిశారు. అడ్వానీకి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పుస్కారం ‘భారత రత్న’ (Bharat Ratna) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అడ్వానీని నితీశ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
నితీశ్ కుమార్ ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం తొలిసారి ఆయన రాజధానిలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించారు. అదే సందర్భంలో రాష్ట్రంలో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలపై కూడా చర్చించినట్లు సమాచారం.
Delhi | Bihar CM Nitish Kumar meets veteran BJP leader LK Advani and congratulates him on ‘Bharat Ratna’ pic.twitter.com/zQUoZXqouR
— ANI (@ANI) February 8, 2024
Also Read..
Nitish Kumar | ఇక ఎప్పటికీ ఎన్డీయే కూటమిని వదలను : నితీశ్ కుమార్