పాట్నా: అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలతో ఒకవైపు బీహార్ మండుతుంటే, మరోవైపు అధికారంలో ఉన్న జేడీయూ, బీజేపీ తమ మధ్య పోరులో బిజీగా ఉన్నాయని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విమర్శించారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా బీహార్లో తీవ్రస్థాయికి చేరిన నిరసనలపై ఆయన స్పందించారు. అగ్నిపథ్ స్కీమ్ హింస, విధ్వంసం కోసం కాదని తెలిపారు. అయితే దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగాలని అన్నారు. ‘బీహార్ ప్రజలు… జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), బీజేపీ మధ్య విభేదాల భారాన్ని భరిస్తున్నారు. బీహార్ మండుతోంది. రెండు పార్టీల నాయకులు చిచ్చు, ఎదురుదాడిలో బిజీగా ఉన్నారు. సమస్యను పరిష్కరించడానికి బదులుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు’ అని ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్ ద్వారా విమర్శించారు.
కాగా, అగ్నిపథ్కు వ్యతిరేకంగా బీహార్లో అల్లర్లు చెలరేగాయి. బీజేపీకి చెందిన డిప్యూటీ సీఎం రేణు దేవి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ ఇళ్లపై ఆందోళనకారులు దాడులు చేసి ధ్వంసం చేశారు. అయితే తాము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ తమ ఆస్తులను రక్షించుకోలేకపోతున్నామని బీజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్ విమర్శించారు. నిరసనలను అదుపు చేయడంలో సీఎం నితీశ్ కుమార్ విఫలమయ్యాయరని ఆరోపించారు. అగ్నిమాపక శాఖకు ఫోన్ చేయగా స్థానిక యంత్రాంగం అనుమతి అవసరమని సిబ్బంది చెప్పారంటూ మీడియా ఎదుట వాపోయారు. తాము ప్రభుత్వంలో భాగమైనప్పటికీ, ఇలాంటివి దేశంలో మరెక్కడా జరుగవని అన్నారు. ఇవి ఆగకపోతే అధికారం పంచుకున్న వారి (జేడీయూ)కి మంచిది కాదంటూ వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు బీజేపీ నేతల సంతృప్తి, హెచ్చరికలను సీఎం నితీశ్ కుమార్ పార్టీకి చెందిన జేడీయూ నేతలు ఖండించారు. రాష్ట్రంలో అధికారం పంచుకున్న బీజేపీ అనవసరంగా జేడీయూపై నిందలు వేస్తున్నదని ఆ పార్టీ ఎంపీ రాజీవ్ రంజన్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న యువత దేశ వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారని తెలిపారు. హింసను తాము అంగీకరించనప్పటికీ, ప్రజల ఆందోళనను కూడా బీజేపీ గ్రహించాలని అన్నారు. దీనికి బదులుగా పరిపాలనా యంత్రాంగంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మీరు (బీజేపీ) తీసుకున్న నిర్ణయానికి అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు. నిరసనకారుల కోపాన్ని అదుపు చేయలేని బీజేపీ, పరిపాలనపై నిందలు వేస్తోందని ఆరోపించారు.
#Agnipath पर आंदोलन होना चाहिए, हिंसा और तोड़फोड़ नहीं।
बिहार की जनता #JDU और #BJP के आपसी तनातनी का ख़ामियाज़ा भुगत रही है। बिहार जल रहा है और दोनों दल के नेता मामले को सुलझाने के बजाए एक दूसरे पर छींटाकशी और आरोप प्रत्यारोप में व्यस्थ हैं।
— Prashant Kishor (@PrashantKishor) June 19, 2022