ముంబయి : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నమోదు చేసిన కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. మనీలాండరింగ్ కేసులో అనిల్ దేశ్ముఖ్కు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను కోర్టు సమర్థించింది. బెయిల్పై సీబీఐ చేసిన అప్పీల్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అనిల్ దేశ్ముఖ్ ఇప్పటికే జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే.
గతేడాది డిసెంబర్లో అనిల్ దేశ్ముఖ్కు బాంబే హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. డిసెంబర్ 12న బాంబే హైకోర్టు రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుపై అనిల్ దేశ్ముఖ్కు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఆర్డర్పై అప్పీల్ చేసుకునేందుకు సీబీఐకి హైకోర్టు 10 రోజుల సమయం కూడా ఇచ్చింది. నవంబర్ 2022లో, అనిల్ దేశ్ముఖ్ బెయిల్ పిటిషన్ను ముంబయి ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. దిగువ కోర్టు నిర్ణయాన్ని దేశ్ముఖ్ బాంబే హైకోర్టులో సవాల్ చేయగా.. బెయిల్ మంజూరైంది. తాజాగా బెయిల్కు వ్యతిరేకిస్తూ సీబీఐ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.